ఫ్యాక్ట్ చెక్: ఏపీలో వరద బాధితులకు డ్రోన్స్ ద్వారా సహాయాన్ని అందిస్తున్న ఫోటో ఏఐ ద్వారా రూపొందించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుండి గణనీయమైన ఇన్‌ఫ్లో కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లోని నీటి వనరులు పొంగిపొర్లడంతో వరదలు సంభవించాయి.

Update: 2024-09-05 10:31 GMT

Drone

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుండి గణనీయమైన ఇన్‌ఫ్లో కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లోని నీటి వనరులు పొంగిపొర్లడంతో వరదలు సంభవించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వ్యక్తులకు అవసరమైన వస్తువులను సరఫరా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది.

దాదాపు వారం రోజులుగా విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన మీడియాతో చిత్రాలను కూడా పంచుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ల చిత్రాలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.
ఇంతలో వరద నీటిలో చిక్కుకుపోయిన వృద్ధ మహిళకు డ్రోన్ ద్వారా పంపిన సామాగ్రిని తీసుకుంటూ ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది వరద ప్రభావిత ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యల చిత్రాలలో ఒకటిగా చెబుతున్నారు. ‘Here’s how technology can come in handy during crisis. Now drones delivering relief materials to those stranded in floods #VijayawadaFloods’ అనే క్యాప్షన్ తో ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు. విజయవాడలో డ్రోన్స్ ను ఉపయోగించి రిలీఫ్ వస్తువులను అందిస్తున్నారని వైరల్ మెసేజీలో ఉంది.
మరో X వినియోగదారు “మంచి కోసం ఉపయోగించినప్పుడు, సాంకేతికత ద్వారా అద్భుతాలు చేయవచ్చు” అనే శీర్షికతో వైరల్ చిత్రాన్ని పంచుకున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి @ncbn గారు నాయకత్వంలో మొట్టమొదటిసారిగా, GoAP ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధిత ప్రాంతాలలో ప్రాణాలను రక్షించే సామాగ్రిని అందించడానికి డ్రోన్‌లను మోహరించింది. ఈ డ్రోన్‌లు పడవలు లేదా హెలికాప్టర్‌ల ద్వారా చేరుకోలేని ప్రాంతాలను చేరుకోగలవు, విపత్తు ప్రతిస్పందనలో విప్లవాత్మక మార్పులు, సహాయాన్ని మునుపెన్నడూ లేనంతగా అందుబాటులోకి తీసుకుని వచ్చారని ఆ పోస్టుల్లో తెలిపారు.
ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా షేర్ చేశారు, తర్వాత చిత్రాలు మార్చారు. 



 


 డ్రోన్‌లను ఉపయోగించి వరద ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకుపోయిన ప్రజలకు రోజువారీ అవసరాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పవన్ కళ్యాణ్ చూపించే వీడియో ఇక్కడ ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. చెలామణిలో ఉన్న చిత్రం AI ద్వారా రూపొందించిన చిత్రం.
మేము X వినియోగదారు భాగస్వామ్యం చేసిన చిత్రాన్ని గమనించగా.. ‘Imagined with AI’ అని పేర్కొన్న వాటర్‌మార్క్‌ని మేము కనుగొన్నాము. దీన్ని బట్టి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇమేజెస్ ను తయారు చేశారని తెలుస్తోంది.

తదుపరి శోధనలో, వాటర్‌మార్క్ Meta కు చెందిన ఉచిత AI అసిస్టెంట్ Meta AIకి చెందినదని మేము కనుగొన్నాము. ఇది దాని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో - WhatsApp, Instagram, Facebook, Messengerలో ఉంది. ఇది ప్రశ్నలకు సమాధానమివ్వగలదు. అధిక-నాణ్యత ఉన్న చిత్రాలు, యానిమేషన్‌లను రూపొందించగలదు.
హైవ్ మోడరేషన్ అనే AI డిటెక్షన్ టూల్‌తో చిత్రం AI రూపొందించారా అని మేము తనిఖీ చేసాం. AIని ఉపయోగించి రూపొందించారని అందులో తెలిపింది.

AP ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ X పోస్ట్‌పై రాష్ట్రంలోని వరద బాధిత వ్యక్తులకు సహాయం చేయడానికి డ్రోన్‌ల ఉపయోగానికి సంబంధించిన ఇతర చిత్రాలు, వీడియోలతో వైరల్ చిత్రాన్ని భర్తీ చేశారు.
వార్తా నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల నివాసితులకు ఆహారం, నీటి ప్యాకెట్లను సరఫరా చేయడానికి AP ప్రభుత్వం డ్రోన్‌లను సిద్ధం చేసింది. అజిత్ సింగ్ నగర్‌, కొత్త, పాత రాజరాజేశ్వరి పేట, వాంబే కాలనీ, పీపుల్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లోని నివాసితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు చేరాయని, గత మూడు రోజులుగా ఈ ప్రాంతాలు బుడమేరులో మునిగిపోయాయని అధికారులు తెలిపారు.

అందువల్ల వరద నీటిలో మునిగిపోయిన వృద్ధురాలికి డ్రోన్ ద్వారా అవసరమైన సామాగ్రిని అందిస్తున్నారన్న వైరల్ చిత్రం అసలు చిత్రం కాదు. ఇది AI ద్వారా రూపొందించిన చిత్రం. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim :  ఏపీలోని వరద బాధితులకు అవసరమైన వాటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం డ్రోన్‌లను ఉపయోగం చూపుతోంది వైరల్ చిత్రం
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News