ఫ్యాక్ట్ చెక్: వైఎస్ విజయమ్మ వైసీపీ దారుణంగా ఓడిపోవాలని కోరుకోలేదు. వైరల్ వీడియో పాతది. ప్రజలను తప్పుదోవ పట్టించేది

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధినాయకుడిగా ఉన్న వైసీపీ 2024 ఎన్నికల్లో అవమానకరమైన రీతిలో ఓడిపోవడమే కాదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచేందుకు సీట్లు కూడా పొందలేదు. అధికారిక ప్రతిపక్షంగా అర్హత సాధించడానికి,

Update: 2024-06-18 06:09 GMT

vijayamma

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధినాయకుడిగా ఉన్న వైసీపీ 2024 ఎన్నికల్లో అవమానకరమైన రీతిలో ఓడిపోవడమే కాదు, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచేందుకు సీట్లు కూడా పొందలేదు. అధికారిక ప్రతిపక్షంగా అర్హత సాధించడానికి, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా రావడానికి ఏ పార్టీ అయినా మొత్తం సీట్ల సంఖ్యలో కనీసం 10% సాధించాలి. వైఎస్సార్‌సీపీకి 11 సీట్లు మాత్రమే ఉన్నాయి. 


వైఎస్‌ఆర్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాకూడదని తాను దేవుడిని ప్రార్థించానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. ‘దేవుడున్నాడు విజయలక్ష్మి గారు.. ఉన్నాడు..’. ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదని ప్రార్థించా: వైఎస్ విజయమ్మ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలు మాత్రమే సాధించి, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. “ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని దేవుడిని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థనను నిజం చేశారు” అని పేర్కొన్నారు. దీంతో 'దేవుడున్నాడు విజయలక్షిగారు' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Full View

వాట్సాప్ లో కూడా ఇదే వీడియో వైరల్ గా షేర్ అవుతోంది



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీ పార్టీ గెలిచి, టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పుడు వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇది. ఈ ప్రకటన పాతదే.

మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేయగా.. 5 సంవత్సరాల క్రితం మే 23, 2019 న‘YS Jagan along with Vijayamma and family members on winning in 2019 general elections’ అనే శీర్షికతో 5 సంవత్సరాల క్రితం సిరి టీవీ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన సుదీర్ఘ వీడియో ఇది. ఈ వీడియోలో వైఎస్ విజయమ్మ పలు విషయాలను పంచుకున్నారు. ఈ వీడియోలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన గెలుపు గురించి మాట్లాడిన తర్వాత, వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ “ఏ పార్టీకి (టీడీపీ) ప్రధాన ప్రతిపక్ష హోదా రాకూడదని నేను దేవుడిని ప్రార్థించాను, దేవుడు నా ప్రార్థనలు విన్నాడు. నా కొడుకు దీన్ని సాధించాడు. ” అని చెప్పారు.
Full View
ఈ వీడియోలో సాక్షి టీవీ లోగో ఉన్న మైక్, యాంకర్ స్వప్నను మనం చూడవచ్చు. ఆ వీడియోను‘YS Jaganmohan Reddy I YS Vijayamma I YS Bharati I Face to Face – Watch exclusive’ అనే శీర్షికతో సాక్షి టీవీ ఎక్స్ క్లూజివ్ గా ప్రచురించినట్లు తెలిసింది. వైరల్ వీడియో 4.27 నిమిషాలకు మొదలై 4.35 నిమిషాల వరకు కొనసాగుతుంది. దేవుడు తన మాట విన్నాడని, తన కొడుకు గెలిచాడని వైఎస్ విజయమ్మ ఆరోజు వ్యాఖ్యలు చేశారు.
Full View

2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైసీపీ అధికారం కైవసం చేసుకోగా, టీడీపీ 23 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగినప్పటి నుండి వీడియో వైరల్ అవుతూ ఉంది. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంది. కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో విజయమ్మ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినవి కావు.
Claim :  వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ విజయమ్మ అన్నారు.
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News