రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు.. తీరా చూస్తే!!

కేరళకు చెందిన ఓ వ్యక్తి గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు

Update: 2024-07-15 10:46 GMT

కేరళకు చెందిన ఓ వ్యక్తి గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. తీరా చూస్తే.. అతడు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చిక్కుకుపోయిన 59 ఏళ్ల వ్యక్తిని సోమవారం ఉదయం కాపాడారు. లిఫ్ట్ ఆపరేట్ వచ్చి రక్షించినట్లు పోలీసులు తెలిపారు. తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని ఓపీ బ్లాక్‌లోని లిఫ్ట్‌లో రోగి ఇరుక్కుపోయిన విషయం ఆస్పత్రిలో ఎవరికీ తెలియదు. ఉల్లూరుకు చెందిన రవీంద్రన్ నాయర్ (59) శనివారం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఓపీ బ్లాక్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు.

శనివారం రవీంద్రన్ నాయర్ తన భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చాడు. రవీంద్రన్ ఆసుపత్రి నుండి బయలుదేరబోతుండగా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లేందుకు అతను లిఫ్ట్‌లోకి ఎక్కాడు.. అయితే లిఫ్ట్ కిందకు వచ్చి తెరుచుకోలేదని, సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ రాలేదని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. లిఫ్ట్ రెండు అంతస్తుల మధ్య చిక్కుకుపోయినట్లు సమాచారం. అతని ఫోన్ కిందపడి పగిలిపోయింది. తాను లిఫ్ట్‌లో ఉండి కాల్ చేయడానికి ప్రయత్నించానని, అయితే ఎవరూ స్పందించలేదని రవీంద్రన్ తెలిపాడు.
నేను లిఫ్ట్ లోపల ఉన్నప్పుడు అన్ని ఎమర్జెన్సీ నంబర్‌లకు కాల్ చేయడానికి ప్రయత్నించాను.. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అలారం కూడా మోగింది కానీ ఎవరూ రాలేదు. కొంత సమయం తరువాత అది రెండవ శనివారం, మరుసటి రోజు ఆదివారం అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే సహాయం కోసం వేచి చూస్తూ ఉన్నానని తెలిపాడు రవీంద్రన్.


Tags:    

Similar News