కల్కి టిక్కెట్ ధరల పెంపుదలకు ఏపీ సర్కార్ అనుమతి

కల్కి సినిమా ధరల పెంపుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అదనపు షోలు వేయడానికి కూడా ఓకే చెప్పింది

Update: 2024-06-25 04:39 GMT

కల్కి సినిమా ధరల పెంపుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అదనపు షోలు వేయడానికి కూడా ఓకే చెప్పింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా ఈ నెల 27వ తేదీన విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలు, టిక్కెట్లు ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా అదనపు షోలు, టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతించింది.

అదనపు షోలు కూడా...
ఈ నెల 27వ తేదీ నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి చిత్రం టిక్కెట్లపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్భయి ఐదు రూపాయలు, మల్టీప్లెక్స్ ల్లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.


Tags:    

Similar News