స్మార్ట్‌ గేమ్‌ ఆడిన సొహైల్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రాండ్‌ ఫినాలే రోజున ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఒకటి చోటుచేసుకుంది. టాప్‌-5 నుంచి హారిక, అరియానా వెళ్లిపోయిన తర్వాత హౌస్‌లో మిగిలిన అభిజీత్‌, అఖిల్‌, [more]

Update: 2020-12-21 06:00 GMT

బిగ్‌బాస్‌ హౌస్‌లో గ్రాండ్‌ ఫినాలే రోజున ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఒకటి చోటుచేసుకుంది. టాప్‌-5 నుంచి హారిక, అరియానా వెళ్లిపోయిన తర్వాత హౌస్‌లో మిగిలిన అభిజీత్‌, అఖిల్‌, సొహైల్‌కు నాగార్జున ఓ ఆఫర్‌ ఇచ్చారు. ఎవరైతే స్వచ్ఛందంగా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వస్తారో వారికి రూ.25 లక్షలు ఇస్తానని ప్రకటించారు. నాగార్జున ఇచ్చిన ఆఫర్‌కు సోహైల్‌ ఓకే చెప్పాడు. అందులో రూ.5 లక్షలు మెహబూబ్‌కు, రూ.10 లక్షలను అనాథ శరణాలయానికి ఇస్తానని చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన మెహబూబ్‌ తనకిస్తానన్న రూ.5 లక్షలు కూడా అనాథ శరణాలయానికి ఇస్తానని ప్రకటించాడు. దీంతో నాగార్జున ఇంకో ఆఫర్‌ ఇచ్చాడు.

అనాథ శరణాలయానికి రూ.10 లక్షలు తన సొంత డబ్బులు ఇస్తానని చెప్పడంతో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందు అరియానాకు రూ.10లక్షలు ఆఫర్‌ చేసినా ఆమె తిరస్కరించింది. చివరి వరకూ పోటీలో ఉండేందుకే మొగ్గు చూపింది. గత మూడు సీజన్ల ఫినాలేలో ఇలాంటి ఆపర్‌ ఇచ్చినా ఎవరూ తీసుకునేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. మరోవైపు మెహబూబ్‌ రూ.5లక్షలు అనాథ శరణాలయానికి ఇస్తాడని నాగార్జున.. చిరంజీవికి చెప్పడంతో స్పందించిన చిరంజీవి వెంటనే మెహబూబ్‌కు చెక్కును వేదికపైనే అందించారు.

Tags:    

Similar News