ఎంతడిగితే అంత ఇస్తారా?

ప్రభాస్ రాధే శ్యాం ఫస్ట్ లుక్ విడుదల కావడం టాప్ ట్రేండింగ్ లోకి రావడం.. బాలీవుడ్ పరంగా రాధేశ్యాం కి భారీ హైప్ రావడంతో ప్రభాస్ బాహుబలి [more]

Update: 2020-07-16 03:54 GMT

ప్రభాస్ రాధే శ్యాం ఫస్ట్ లుక్ విడుదల కావడం టాప్ ట్రేండింగ్ లోకి రావడం.. బాలీవుడ్ పరంగా రాధేశ్యాం కి భారీ హైప్ రావడంతో ప్రభాస్ బాహుబలి రేంజ్ మరింతగా పెరిగింది. ప్లాప్ సినిమా సాహో నే బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అలాంటిది క్రేజున్న రాధేశ్యాం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచెయ్యరూ… అయితే ప్రభాస్ రాధే శ్యాం తర్వాత నాగ్ అశ్విన్ తో మరో పాన్ ఇండియా మూవీకి కమిట్ అయ్యాడు. నాగ్ అశ్విన్ ప్రభాస్ కోసం 13 ఏళ్ళ క్రితమే రాసుకున్న స్క్రిప్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో నటించబోయే హీరోయిన్ పై అందరిలోను ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ అంటే.. ప్రభాస్ కి బాలీవుడ్ భామే.. అందులోను క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బావుంటుంది అని నాగ్ అశ్విన్ డిసైడ్ అయ్యి.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనేని సంప్రదించినట్లుగా వార్తలొచ్చాయి.

ఆ తర్వాత దీపికా పదుకొనే నాగ్ అశ్విన్ మహానటి చూసి.. నాగ్ అశ్విన్ ని అభినందించడంతో ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే పాన్ ఇండియా ఫిలిం, బాలీవుడ్ లో సక్సెస్ ల జోరులో ఉన్న దీపికా పదుకొనే ప్రభాస్ మూవీ కోసం భారీ పారితోషికం అడిగినట్లుగా.. అది కూడా తెలుగులో నటించే హీరోయిన్స్ కి ఇచ్చే పారితోషికానికి నాలుగింతలు ఎక్కువగా అడిగినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆయితే అశ్విని దత్ అండ్ నాగ్ అశ్విన్ లు ఎలాగైనా ఎంతిచ్చి అయినా దీపికా పదుకొనేని ప్రభాస్ కోసం ఫిక్స్ చెయ్యాలని.. ప్రభాస్ పక్కన దీపికా అయితే సినిమాకి భారీ క్రేజ్ రావడం ఖాయమని భావిస్తున్నారట.

Tags:    

Similar News