ప్రభాస్ విలన్ అతనేనా?

బాలీవుడ్ లో తానాజీ దర్శకుడు ఓం రనౌత్ టి సీరీస్ తో కలిసి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ ని ఆదిపురుష్ సినిమాని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. వన్ [more]

Update: 2020-08-21 03:09 GMT

బాలీవుడ్ లో తానాజీ దర్శకుడు ఓం రనౌత్ టి సీరీస్ తో కలిసి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ ని ఆదిపురుష్ సినిమాని డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. వన్ అఫ్ ద నిర్మాతగా ఓం రనౌత్ ప్రభాస్ సినిమా లో భాగమయ్యాడు. అది పురుష్ కథ నచ్చిన ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. అది కాస్త పోస్టర్ రూపంలో ప్రకటన రావడం అన్ని కరోనా లాక్ డౌన్ లోనే చకచకా జరిగిపోయాయి. అయితే ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. ప్రభాస్ రేంజ్ కి అది ఏమాత్రం ఎక్కువ కాదని నిర్మాతల నమ్మకంతోనే ఈ సినేమానికి ఇంత బడ్జెట్ పెడుతున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ప్రియాంక చోప్రా నటించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

ఇక ఇలాంటి సినిమాలో విలన్ పాత్రపై కూడా బోలెడంత క్యూరియాసిటీ ఉంది. బాలీవుడ్ హీరోల్లోనే ఎవరైనా విలన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటుంటే.. కాదు.. ఓం రనౌత్ గత చిత్రం తానాజీలో నటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ ఆదిపురుష్ విలన్ గా నటించే అవకాశం కలదు అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్‍కి కూడా విలన్‍గా నటిస్తే బాగుంటుందని ఓం భావిస్తున్నాడట. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న ఈ సినిమా పక్కా హిట్ అంటూ ప్రభాస్ ఫాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేసారు.

Tags:    

Similar News