థియేటర్ స్క్రీన్స్ చింపేసిన ప్రభాస్ ఫ్యాన్స్

ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా ఈరోజు రీరిలీజ్ అయింది.

Update: 2023-08-18 11:02 GMT

ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమా ఈరోజు రీరిలీజ్ అయింది. అయితే ఓ థియేటర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రభాస్ ఫాన్స్ యోగి రీరిలీజ్ సందర్బంగా సంబరాలు చేస్తూ రాజ్ థియేటర్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా రెండు చోట్ల చిరిగిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా శ్రీప్రియ థియేటర్లో కూడా అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. శుక్రవారం ప్రభాస్ సినిమా యోగి రీరిలీజ్ సందర్బంగా ఫాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా స్క్రీన్ చింపడమే కాకుండా కుర్చీలు కూడా ధ్వంసం చేసారు. ఈ థియేటర్ ను ఈ మధ్య కాలంలోనే బాగా రెడీ చేశారు. ఇంతలో ఇలా ధ్వంసం కావడంతో థియేటర్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహానికి గురైంది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News