మహేష్.. త్రివిక్రమ్ ని కన్ఫ్యూజన్ లో పడేశాడా?

మహేష్ బాబు అతి త్వరలోనే పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ తర్వాత [more]

Update: 2020-10-09 05:23 GMT

మహేష్ బాబు అతి త్వరలోనే పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. అయితే సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ తర్వాత సినిమాని ఓకె చెప్పడానికి ఓ ఆరు నెలలు పట్టింది. కానీ సర్కారు వారి పాట సినిమా ఓకె అయ్యాక మహేష్ రాజమౌళితో సినిమా అంటూ రాజమౌళి చెప్పేసాడు. సర్కారు వారి పాట అవ్వగానే రాజమౌళితో సినిమా ని మహేష్ మొదలుపెడతాడని అన్నారు. అయితే రాజమౌళి తర్వాత మహేష్ బాబు పక్కా ప్లానింగ్ తో త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుంది అంటూ అనౌన్స్ చేసేసాడు. అయితే ఇక్కడ ఈ అనౌన్సమెంట్ తో మహేష్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ. కానీ త్రివిక్రమే కాస్త కన్ఫ్యూషన్ లో ఉన్నట్టుగా టాక్.

అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో సినిమా ని కమిట్ చేయించుకున్నాడు. ఎప్పుడో ఏప్రిల్ లో మొదలు కావాల్సిన ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోకి కరోనా అడ్డం పడింది. ఎన్టీఆర్ ఇంకా RRR షూటింగ్ లోనే ఉన్నాడు. లేదంటే పర్ఫెక్ట్ గా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా మొదలయితే సంక్రాంతికి సినిమాని విడుదల చేసేసేవాడే త్రివిక్రమ్. అయితే ఎన్టీఆర్ RRR అవ్వాలి.. అప్పుడు తన సినిమా మొదలెట్టాలి. దీనికి చాలా టైం పట్టేట్టు ఉంటే.. ఇప్పుడు మహేష్ తో సినిమా ఎనౌన్సమెంట్ తో త్రివిక్రమ్ మహేష్ కి కథ సిద్ధం చెయ్యాలా… లేదంటే ఎన్టీఆర్ కోసం అలానే వెయిట్ చెయ్యాలా.. ఎలాగూ మహేష్ కి సర్కారు వారి పాట అవ్వాలి.. తర్వాత రాజమౌళి తో సినిమా అవ్వాలి. అందుకే మరో కథతో మరో హీరోని వెతుక్కోవాలా.. అనే కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నాడంటున్నారు.

Tags:    

Similar News