నందమూరి ‘బ్రదర్స్’ గురించి 5న క్లారిటీ

Update: 2016-10-03 11:19 GMT

అక్టోబర్ 5 న రాజమౌళి ఏదో గుడ్ న్యూస్ చెప్తానని 5 రాకుండానే 4 రోజుల ముందే ఆ న్యూస్ చెప్పేసాడు. అదేమిటంటే బ్యాంకాక్ లో మేడం టూ సాడ్స్ మ్యూజియం లో ప్రభాస్ మైనపు ప్రతిమ ప్రతిష్టించబోతున్నారని చెప్పేసాడు. ఇక ప్రభాస్ కి ఒక అరుదైన గౌరవం దక్కబోతుందని 4 రోజుల ముందే రివీల్ చేసేసాడు రాజమౌళి. ఇక ఇప్పుడు అక్టోబర్ 5 న మరో సంచలన న్యూస్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆ న్యూస్ కూడా కొంచెం కొంచెం గా బయటికి వచ్చేసింది. దానిలో నిజమెంతో తెలియదు గాని ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో మాత్రం ఒకటే న్యూస్ హల్ చల్ చేస్తుంది అదేమిటంటే కళ్యాణ్ రామ్ , జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒక చిత్రం చేయబోతున్నారని. అదేమిటి వీరిఇద్దరూ కలిసి నటిస్తారని ఎప్పుడో చెప్పారుగా అంటారా. అదేనండి వీరిద్దరూ కలిసి బ్రదర్స్ సినిమాలో కనిపించబోతున్నారని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ న్యూస్ రావడానికి ప్రధాన కారణం మాత్రం కళ్యాణ్ రామ్ తన ఓన్ బ్యానర్ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై 'బ్రదర్స్' అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని అంటున్నారు. అయితే ఆ 'బ్రదర్స్' టైటిల్ మాత్రం అన్నదమ్ముల కోసమే అని ప్రచారం మొదలైంది. మరి ఎన్టీఆర్ ప్రధాన పాత్రతో కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కి అన్నగా ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే ఈ సినిమాకి డైరెక్టర్ సెట్ కావాల్సి ఉందని..... అయితే ఇప్పటికే వంశీ వక్కంతం కథ ఎన్టీఆర్ దగ్గరే ఉన్నప్పటికీ... వంశీతో కలిసి పని చెయ్యడానికి ఎన్టీఆర్ ఇంకా డిసైడ్ కాలేదని అందుకే ఇంకా ఆలోచనలోనే వున్నదని అంటున్నారు. అయితే మరో పక్క అనిల్ రావిపూడితో కూడా ఎన్టీఆర్ సినిమా చెయ్యాలని సిద్ధమవుతున్నాడనే వార్తలొస్తున్నాయి.

అయితే ఈ విషయం రూమరా లేక నిజమేనా అన్నది మాత్రం అక్టోబర్ 5 న 'ఇజం' ఆడియో వేడుకలో ఒక క్లారిటీ ఇస్తారని అంటున్నారు. ఇక 'ఇజం' ఆడియో వేడుకకి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడని సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ఎప్పటి నుండో ఒక సినిమాలో నటించాలని అనుకుంటున్నారు. మరి అందుకోసమే ఈ 'బ్రదర్స్' టైటిల్ ని రిజిస్టర్ చేయించారనికూడా కొందరు కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఏ విషయమైనా అక్టోబర్ 5 మాత్రం దీనిపై ఫుల్ క్లారిటీ మాత్రం వచ్చేస్తుందని నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Similar News