మోదీ ప్రమాణానికి అరుదైన వ్యక్తికి ఆహ్వానం

ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇందుకోసం ప్రత్యేక అతిధులు కూడా వస్తున్నారు

Update: 2024-06-09 03:44 GMT

ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇందుకోసం ప్రత్యేక అతిధులు కూడా వస్తున్నారు. అయితే అతిధుల్లో పారిశుద్ధ్యకార్మికులతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే మోదీ ప్రమాణ స్వీకారానికి అతిధిగా వందే భారత్ ట్రైన్ పైలట్ కు ఆహ్వానం అందింది.

వందేభారత్ రైలు...
మోదీ ప్రమాణ స్వీకారోత్సవా నికి మొత్తం ఎనిమిది వేల మందికి ఆహ్వానాలు అందాయి. ఇందులో దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్‌కి చెందిన లోకో పైలట్ ఐశ్వర్య కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె వందేభారత్ రైలులో పనిచేస్తున్నారు. అలాగే మహారాష్ట్రకు చెందిన లోకో పైలట్ సురేఖ యాదవ్‌కి కూడా ఆహ్వానం అందింది. ఈమె ఆసియాలోనే మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌ గా నియమితులయ్యారు.


Tags:    

Similar News