నిజంగా చేదువార్తే

దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పదిగ్రాముల బంగారంపై రూ.200లు పెరిగింది. వెండి కూడా పెరిగింది.

Update: 2023-04-20 03:18 GMT

బంగారం అంటేనే స్టేటస్ సింబల్‌గా మారింది. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గౌరవం దక్కుతుందని దక్షిణ భారతదేశం మహిళలు భావిస్తారు. అందుకే ధరలు పెరుగుతున్నా బంగారానికి మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంచడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను కూడా తగ్గించడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు

ధరలు ఇలా...
తాజాగా పసిడిప్రియులకు మార్కెట్ షాక్ ఇచ్చింది. దేశంలో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పదిగ్రాముల బంగారంపై రూ.200లు పెరిగింది. వెండి కూడా పెరిగింది. కిలో వెండి ధరపై రూ.500లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,050 రూపాయలకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,150 రూపాయలు పలుకుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 81,000 రూపాయలకు చేరింది.


Tags:    

Similar News