Narendra Modi: ఎక్స్ లో నరేంద్ర మోదీ నయా రికార్డు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు

Update: 2024-07-14 15:50 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయనను ట్విట్టర్(ఎక్స్) లో ఏకంగా 100 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. "A hundred million on X! Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism, and more. Looking forward to an equally engaging time in the future as well." అంటూ మోదీ ట్వీట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నా ఫాలోవర్ల సంఖ్య వంద మిలియన్లు దాటిపోయింది.. ఎక్స్ మాధ్యమంలో ఉండడం, చర్చలు, ఆలోచనలు పంచుకోవడం, ప్రజల ఆశీస్సులు, నిర్మాణాత్మక విమర్శలు... ఇలా ఎన్నో ఈ వేదిక ద్వారా పొందగలుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు మోదీ. 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో అత్యధికంగా అనుసరించే వ్యక్తులలో ప్రధాని మోదీ ఒకరిగా నిలిచారు. ఆయన ఇతర భారతీయ రాజకీయ నాయకులను అధిగమించడమే కాకుండా, జో బిడెన్, పోప్ ఫ్రాన్సిస్‌తో సహా అత్యంత శక్తివంతమైన ప్రపంచ నాయకులలో పలువురిని అధిగమించారు. భారత్ లో విపక్ష నేత రాహుల్ గాంధీ 'ఎక్స్' ఫాలోవర్ల సంఖ్య 26.4 మిలియన్లు ఉన్నారు.


Tags:    

Similar News