పసిడి మరింత ప్రియం

ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి

Update: 2023-02-19 03:28 GMT

బంగారం అంటేనే భారతీయ మహిళలకు మక్కువ ఎక్కువ. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. అందుకే భారత్ లో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం, కేంద్ర బడ్జెట్ కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. అయినా సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.

వెండి కూడా...
తాజాగా ఈరోజు దేశంలో బంగారం ధరలు మరింత పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ.600లు పెరిగింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,200 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,950 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,800 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News