IPL 2025 : నేడు మరో బిగ్ మ్యాచ్

నేడు మరో బిగ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో నేడు ముంబయి ఇండియన్స్ తలపడనుంది.;

Update: 2025-03-29 02:15 GMT
mumbai Indians, gujarat titans, IPL 2025, ahmedabad
  • whatsapp icon

నేడు మరో బిగ్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో నేడు ముంబయి ఇండియన్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పాలి. చివరి వరకూ టెన్షన్ పెడుతుందని చెప్పక తప్పదు. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. రెండు జట్లు ఓటమితో కసి మీద ఉన్నాయి. దీంతో గెలుపు కోసం ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ప్రయత్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

బలాబలాలు...
బలాబలాలు తీసుకున్నా రెండు జట్లు సమ ఉజ్జీలుగానే ఉండటంతో ఈ మ్యాచ్ మరోసారి చివరి బాల్ వరకూ టెన్షన్ పెడుతుందన్న అంచనాలు క్రికెట్ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా తిరిగి వచ్చి తన జట్టుకు విజయం అందిస్తాడా? లేక శుభమన్ గిల్ ఈ మ్యాచ్ ను గెలుచుకుని తమ సత్తా ఇది అని చాటుతాడా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ మ్యాచ్ శనివారం కావడంతో లక్షలాది మంది ఫ్యాస్స్ ఎదురు చూస్తున్నారు.


Tags:    

Similar News