సరికొత్త చరిత్ర.. స్వర్ణం తీసుకొచ్చిన నీరజ్ చోప్రా

జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. నీరజ్ చోప్రా చారిత్రాత్మక ప్రపంచ

Update: 2023-08-28 02:02 GMT

జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. నీరజ్ చోప్రా చారిత్రాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రా..  హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నీరజ్ చోప్రా ఒలింపిక్ గోల్డ్ మెడల్, డైమండ్ లీగ్ ట్రోఫీ, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గోల్డ్ మెడల్‌తో సహా అన్ని గ్లోబల్ మెడల్స్‌ను పూర్తి చేశాడు.

క్వాలిఫైయర్స్‌లో నీరజ్ 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌‌లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ లో తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. 86.67 మీటర్ల దూరం విసిరిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లెచ్ కాంస్య పతకం సాధించాడు. మహిళల లాంగ్ జంప్‌లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకం, గత ఏడాది యూజీన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ రజత పతకం తర్వాత ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారతదేశానికి 3వ పతకం కావడం విశేషం.


Tags:    

Similar News