KTR : రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్

గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు

Update: 2024-09-23 06:00 GMT

గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీకి ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన ఎక్స్ లో ఈ మేరకు ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజాలను ఎందుకు ప్రభుత్వం దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకు అడ్డుకుంటున్నారు?
బీఆర్ఎస్ పార్టీ గాంధీ ఆసుప్రతిలో జరుగుతున్న వ్యవహారంపై పరిశీలనకు ముగ్గురు నిపుణులైన డాక్టర్లతో నిజనిర్ధారణ కమిటీ తమ పార్టీ వేసిందని, ఆ కమిటీ పర్యటించకుండా ఎందుకు అడ్డుకున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా నిజాలు దాగవని కేటీఆర్ అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేంత వరకూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.


Tags:    

Similar News