Akkineni Nagarjuna : కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా

సినీ హీరో నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితం పిటీషన్ వేశారు

Update: 2024-10-03 12:01 GMT

సినీ హీరో నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితం పిటీషన్ వేశారు. తమ కుటుంబంపై నిరాధారణ ఆరోపణలు చేయడమే కాకుండా, తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చారంటూ నాగార్జున ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. తన కుటుంబాన్ని కించపర్చేలా కొండా సురేఖ మాట్లాడారని, ఆమె పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

న్యాయపోరాటంతోనే...
దీంతో కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఆమెకు తలనొప్పిగా మారనుంది. పరువు నష్టం దావా వేసిన నాగార్జున ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలిసింది. దీంతో పాటు తమను అప్రతిష్ట పలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత అయిన కొండా సురేఖపై న్యాయపోరాటానికి దిగడానికే నాగార్జున నిర్ణయించుకున్నారు.
Tags:    

Similar News