కొండా సురేఖను వివరణ కోరిన పీసీసీ చీఫ్

మంత్రి కొండా సురేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ కోరారు

Update: 2024-10-03 04:16 GMT

mahesh kumar goud pcc chief

మంత్రి కొండా సురేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ కోరారు. నాగార్జున కుటుంబంపై సమంత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేగిన విషయం విదితమే. ఇటు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రాజకీయాల్లోకి సినీ హీరోయిన్లను లాగడమేంటని ప్రశ్నించారు.

డ్యామేజీ జరగడంతో...
మాజీ మంత్రి కేటీఆర్ పై చేయాల్సిన విమర్శలు అవి టర్న్ తీసుకుని నాగార్జున కుటుంబంపైకి మళ్లడంతో ఇష్యూ మొత్తం డైవర్ట్ అయింది. అయితే కొండా సురేఖ వెంటనే సమంతకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి డ్యామేజీ అవుతుందని భావించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరణ కోరారు.


Tags:    

Similar News