Konda Surekha: మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Update: 2024-10-03 10:56 GMT

konda surekha

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆవేశంలో సినీ నటి సమంత మీద చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కేవలం కేటీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా అది రాజకీయంగా బాగానే ఉంటుంది కానీ వ్యక్తిగతంగా పలు నటీనటుల కుటుంబాలను రొచ్చులోకి లాగడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే నేతను ప్రశ్నించే ఉద్దేశ్యంతో చేశాను తప్ప సమంత మనోభావాలను దెబ్బతీయడం కోసం కాదని వివరణ ఇచ్చారు. తన జీవిత ప్రయాణంలో సమంత చూపిన తెగువను తాను మెచ్చుకుంటున్నానన్నారు కొండా సురేఖ. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ క్షమాపణలు తెలిపారు.

అయితే కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం సాగుతోందని, బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదని ఆరోపించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలియదని, గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ సీఎంగా భావించి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని కేటీఆర్ పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం కేటీఆరే అన్నారు.
Tags:    

Similar News