నేడు కేటీఆర్ పిటీషన్ పై విచారణ

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌‌‌‌ పరువునష్టం దావాపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

Update: 2024-10-14 07:27 GMT

ktr, konda surekha 

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌‌‌‌ పరువునష్టం దావాపై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణమని కొండ సురేఖ వివాస్పద వ్యాఖ్యలపై కొండా సురేఖ పై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరువు నష్టం దావా ను నాంపల్లి ప్రత్యేక మెజిస్ట్రేట్‌‌ కోర్టులో వేశారు.

పరువు నష్టం దావా కేసులో...
కేటీఆర్‌‌‌‌ తరఫు న్యాయవాది వీడియోలు సహా 23 రకాల ఆధారాలను కోర్టుకు ఇప్పటికే అందించారు. సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమా, దాసోజు శ్రవణ్‌‌ ను పేర్కొన్నారు. కేటీఆర్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది.. దీంతో నేడు జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది...


Tags:    

Similar News