కొండా సురేఖపై పరువునష్టం దావా వేసిన కేటీఆర్
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాది ఉమామహేశ్వరరావు నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ను సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించారని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేశారు. దీంతో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీకి తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఈ నోటీసులకు కొండా సురేఖ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శలు చేస్తూ ఆమె నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శలు చేస్తూ ఆమె నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.