Nagarjuna Vs KondaSurekha: కొండా సురేఖ లాయర్ చెప్పింది ఇదే!

తన కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ మంత్రి కొండా

Update: 2024-10-08 15:25 GMT

తన కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖపై పిటిషన్‌ దాఖలు చేసిన నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం నాడు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. నాగార్జునతో పాటు ఇద్దరు సాక్షులు యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. నాగార్జున కుటుంబాన్ని, నటి సమంతను కించపరిచేలా మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువునష్టం కేసు వేశారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ తన మాటను వెనక్కి తీసుకుని సమంతకు క్షమాపణలు చెప్పారు.

కొండా సురేఖ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని తెలిపారు. నాగచైతన్య, సమంత విషయంలో నాగార్జున గురించి మాట్లాడిన కొండా సురేఖ ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీసీ మంత్రి కొండా సురేఖపై, ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతో నాగార్జున పరువునష్టం దావా వేశారని సురేఖ తరపు న్యాయవాది ఆరోపించారు. నాగార్జున వేసిన కేసులో ఏమీలేదని, పరువునష్టం దావా కేసులో వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసిందన్నారు.


Tags:    

Similar News