Tdp : జగన్ ను తిట్టారని మరో టీడీపీ నేతపై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ నేతలపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదయింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించారంటూ గుంటూరు అరండల్ పోలీస్ [more]

Update: 2021-10-26 06:07 GMT

తెలుగుదేశం పార్టీ నేతలపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదయింది. ముఖ్యమంత్రి జగన్ ను దూషించారంటూ గుంటూరు అరండల్ పోలీస్ స్టేషన్ లో మేయర్ కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. ఆయనిచ్చిన ఫిర్యాదు మేరకు బొండా ఉమామహేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

టీడీపీ అభ్యంతరం….

కాగా బొండా ఉమామహేశ్వరరావు పై కేసు నమోదు చేయడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కావాలని టీడీపీ నేతలపై వరసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిలో 24 మంది పోలీసుల అరెస్ట్ చేశామని చెప్పడం కూడా అబద్ధమంటున్నారు. కేవలం వారికి నోటీసులు జారీ చేేశారని, పోలీసు అధికారులు తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలని కోరారు.

Tags:    

Similar News