Ys Sharmila : సాయిరెడ్డికి ఇచ్చి పడేసిన వైఎస్ షర్మిల

వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై ఏపీసీసీచీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2024-10-27 11:56 GMT

ys sharmila  stay in vijayawada

వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై ఏపీసీసీచీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్నది వైఎస్ఆర్ మ్యాండేట్ అన్నారామె. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? అని సాయిరెడ్డిని నిలదీశారు. మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే.నంటూ మండిపడ్డారు. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ గారి వల్ల బలపడిన వాళ్ళే. మీరంటూ వైఎస్ షర్మిల అన్నారు. ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదని, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది అని ఆమె గుర్తు చేశారు. బంగారు బాతును ఎవరు చంపుకోరని, సొంత కళ్లను ఎవరు పొడుచుకోరన్నారు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు గారు కారణం అయితే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాశారా ? ప్రశ్నించారు.

చంద్రబాబు పిచ్చి వీడలేదా?
ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదని వైఎస్ షర్మిల నిలదీశారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదని, దోషులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నలు సంధించారు. వైఎస్సార్ మరణం తర్వాత చార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కాదా ?కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా ? చంద్రబాబు తో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్సార్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారు. అలాగే నేను కూడా పిలిచానని చెప్పారు. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ? జగన్ ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News