శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హల్ చల్

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు కనిపించాయి.

Update: 2024-07-03 03:04 GMT

శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిగలపుట్టుగ సముద్ర తీరంలో ఎలుగుబంట్లు కనిపించాయి. సముద్ర తీరంలో అవి స్నానమాడుతూ కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు తిరుగుతుండటంతో మత్స్యకారులు, సందర్శకులు భయంతో పరుగులు తీశారు.

దాడులు చేస్తాయని...
ఇటీవల కాలంలో ఎలుగుబంట్లు మనుషులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఏ వైపు నుంచి వచ్చి అవి దాడులు చేస్తాయోనని ప్రజలు భయాందోళనలు‌ వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు సంచారం పై కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. ప్రమాదం జరగక ముందే చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు స్థానికులు కోరుతున్నారు.


Tags:    

Similar News