తిరుమల లడ్డూ కల్తీ కేసులో.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీకి;

Update: 2025-02-10 03:16 GMT
తిరుమల లడ్డూ కల్తీ కేసులో.. నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
  • whatsapp icon

తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీకి సంబంధించి నలుగురిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అరెస్టయిన వ్యక్తులు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌తో సహా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా చేసిన సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు.

భోలే బాబా డైరీకి డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేశారు. నిందితులను తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఆ తర్వాత అక్రమాలకు పాల్పడ్డారని సిట్ అధికారులు ఆరోపించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సుప్రీంకోర్టు గత అక్టోబరు 4న సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇద్దరు సీబీఐ అధికారులు, హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళి, ఏపీ పోలీసు శాఖ నుంచి ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్డ్స్‌ అథారిటీ నుంచి డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా సభ్యులుగా ఉన్నారు.


Tags:    

Similar News