Tirumala : వామ్మో.. ఇంత క్యూ లైన్.. శ్రీవారి దర్శనానికి?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. క్యూ లైన్లన్నీ నిండిపోయి ఉన్నాయి;

Update: 2024-05-16 03:48 GMT
specaial darshan tickets, november month quota, Tirumala Tirupathi
  • whatsapp icon

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. క్యూ లైన్లన్నీ నిండిపోయి ఉన్నాయి. అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారమయినా భక్తుల రద్దీ అధికంగా ఉంది. సాధారణంగా వీకెండ్ లో రద్దీగా ఉండే తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా ఉంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట ఉన్న ఏటీజీహెచ్ వరకూ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,224 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News