Kurnool : మరో రెండు వజ్రాలు లభ్యం.. వ్యాపారులు ఎంతకు కొన్నారంటే?

వర్షాలు కురుస్తుండటంతో వజ్రాలు బయటపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనేక మందికి వజ్రాలు దొరికాయి

Update: 2024-05-27 04:43 GMT

ర్షాలు కురుస్తుండటంతో వజ్రాలు బయటపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనేక మందికి వజ్రాలు దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. తొలకరి వానలు కురిసినప్పుడు వజ్రాలు పొలాల్లో బయటపడుతుంటాయి. వజ్రాల కోసం అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వెదుకుతుంటారు.

కూలీలకు రెండు వజ్రాలు...
అయితే తాజాగా తుగ్గలి మండలం జొన్నగిరిలో కూలీలకు వజ్రాలు లభ్యమయినట్లు తెలిసింది. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు వజ్రాలు దొరికాయి. దొరికిన డైమండ్స్ ను వ్యాపారులకు గుట్టు చప్పుడు కాకుండా విక్రయించారని చెబుతున్నారు. ఒక వజ్రాన్ని ఏడు లక్షల రూపాయలు, 5 తులాల బంగారం ఇచ్చి ఒక వ్యాపారి సొంతం చేసుకున్నారు. మరో వజ్రాన్ని లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.


Tags:    

Similar News