Election : పోలింగ్ ప్రారంభం.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఉదయాన్నే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది.

Update: 2024-05-13 01:43 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఉదయాన్నే ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క ఓటరు రెండు ఓట్లు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఏపీలో 175 శాసనసభ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ ప్రారంభమయింది.

ఏడు గంటలకు...
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకూ సాగుతుంది. 25 లోక్‌ సభ నియోజకవర్గాలకు 454 మంది అభ్యర్థులు మరిలో ఉన్నారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 2387 మంది అభ్యర్థులున్నారు. ఈసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా ముందుగానే చేరుకున్న ఓటర్లు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.


Tags:    

Similar News