Jawahar Reddy : రెండు రోజుల ముందే పదవీ విరమణ

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రెండు రోజులు ముందే పదవీ విరమణ చేశారు

Update: 2024-06-29 05:16 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి రెండు రోజులు ముందే పదవీ విరమణ చేశారు. వాస్తవానికి ఆయన ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శుక్రవారమే పదవీ విరమణ చేశారు. జవహర్ రెడ్డితో పాటు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా శుక్రవారమే రిటైర్ అయ్యారు. శుక్రవారం పదవీ విరమణ చేసిన వారిలో జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, వెంకటరమణారెడ్డి, అరుణ్ కుమార్ లు పదవీ విరమణ చేశారు.

30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నా...
30వ తేదీతో వీరికి అరవై ఏళ్లు పూర్తికాన్నాయి. 30వ తేదీ ఆదివారం కావడం, శనివారం కూడా సెలవు దినం కావడంతో ఈ నెల 29వ తేదీన నలుగురు ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు ముందు జవహర్ రెడ్డికి ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. పూనం మాలకొండయ్యకు జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. వీరిద్దరూ రిటైర్ కావడంతో వారి స్థానంలో ఆ బాధ్యతలను ఇతర అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించారు.


Tags:    

Similar News