Tirumala : ఆనంద నిలయా గోవిందా... దర్శనం దక్కనీయవా?

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గురువారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-07-18 03:30 GMT

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. గురువారం కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. వసతి గృహాల కోసం ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సి వస్తుందని భక్తులు చెబుతున్నారు. నిన్న భక్తుల రద్దీ కొంత తగ్గినట్లు కనిపించినా ఈరోజు మళ్లీ పెరగడంతో టీటీడీ అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటుననారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

31 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని చెప్పారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,029 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,547 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.90 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News