కోపం ఉంటే చంపేయండి కానీ.. ఇలాంటి ప్రచారం చేయొద్దు: మాజీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున

మహిళ ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జున;

Update: 2024-11-02 03:16 GMT
MeruguNagarjuna, Complaint, YSRCP leader news, TDP latest updates, AndhraPolice, Merugu Nagarjuna asserted, Ap politics AP news today telugu

Merugu Nagarjuna 

  • whatsapp icon

మహిళ ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మేరుగు నాగార్జున, ఆయన పీఏ మురళీమోహన్‌రెడ్డిపై తాడేపల్లి పోలీసులు మోసం, లైంగిక వేధింపుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376, 420, 506 రీడ్ విత్ 34 కింద మేరుగు నాగార్జునను మొదటి నిందితుడిగా, అతని పీఏను రెండో నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున వేమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పిస్తానని హామీ ఇచ్చి రూ.90 లక్షలు తీసుకున్నారని విజయవాడకు చెందిన ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తీసుకున్న తర్వాత మంత్రి తనను మోసం చేశారని, ఏదైనా ఫిర్యాదు చేయడానికి పోలీసులను ఆశ్రయిస్తే చంపేస్తానని అతని పీఏ బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు మేరుగు నాగార్జునతో పాటు అతని పీఏ మురళీమోహన్‌రెడ్డిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతామని తాడేపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) బత్తుల కళ్యాణ్ రాజు తెలిపారు.

మహిళ ఫిర్యాదుపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. తనపై కోపం ఉంటే చంపేయండి కానీ ఇలాంటి ప్రచారం చేయవద్దని కోరారు. రాజకీయాల్లో ఎదుగుతున్న దళితుడిని టార్గెట్ చేస్తున్నారని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, ఈ విషయంలో తప్పు ఉందని తేలిస్తే ఉరి శిక్షకు సైతం సిద్ధమని మేరుగు నాగార్జున వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో తనను అనేక మంది కలిసి ఉంటారని, కానీ ఎవరితోనూ వ్యక్తిగతంగా పరిచయం లేదని అన్నారు. తనపై లైంగిక కేసు పెట్టిన విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. ఏ ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.


Tags:    

Similar News