Tirumala : నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...తిరుమలలో రద్దీ నేడు ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది

Update: 2024-10-03 02:55 GMT

Tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 12వ తేదీన చక్రస్నానంతో ముగుస్తాయి. స్వామి రోజుకొక రూపంలో మాడవీధుల్లో సంచరిస్తారు. అందుకే బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని వీఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సర్వదర్శనం ద్వారానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు గురువారం కావడం దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ తొమ్మిది రోజుల పాటు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వసతి కోసం అధికారులు ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కువ రోజుల తిరుమలలో ఉండే అవకాశం లేదు. కేవలం ఒకరోజు మాత్రమే వసతి గృహాన్ని కేటాయిస్తారు. అవసరమైతే మరోరోజు పొడిగించుకునే వీలుంది. దీంతో భక్తులకు వసతి గృహాల కొరత లేకుండా చేయాలన్నది టీటీడీ అధికారుల ఆలోచన.

పన్నెండు గంటల సమయం...
మరోవైపు ప్రతి రోజూ అన్నదానానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించి ఆ దిశగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్న ప్రసాదం భవనంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మరింత త్వరగా స్వామి వారి దర్శనం పూర్తయ్యే ఏర్పాట్లను చేస్తున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,613 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,403 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ఇంత తక్కువగా ఆదాయం రావడం ఇదే ప్రధమమని అధికారులు చెబుతున్నారు.




Tags:    

Similar News