Pensions : పింఛన్ల కోసం పడిగాపులు.. సచివాలయం వద్ద తిప్పలు

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమయింది.

Update: 2024-04-03 05:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమయింది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచే పింఛన్లు ఇస్తారని భావించి గ్రామ, వార్డు సచివాలయాలకు వృద్ధులు చేరుకున్నారు. అయితే సచివాలయ సిబ్బందికి డబ్బులు అందలేదు. వారు బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని రావడానికి వెళ్లారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.

మధ్యాహ్నం తర్వాత అంటూ...
మధ్యాహ్నం తర్వాత రావాలంటూ కొన్ని సచివాలయాల్లో సిబ్బంది చెబుతున్నారు. దీంతో అక్కడకు వచ్చిన వృద్ధులు తిరిగి ఇంటికి వెళ్లలేక, ఎండకు మళ్లీ రాలేక అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇంటికి తెచ్చి ఇచ్చే పింఛన్ ఎన్నికల కమిషన్ నిబంధనల ఆదేశాలతో వాలంటీర్ల చేత పంపిణీని నిలిపేశారు. దీంతో సచివాలయంలో పింఛన్ల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, దివ్యాంగులకు మాత్రమే ఇంటి వద్ద పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News