విశాఖ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ రైళ్లు మళ్లీ పట్టాలపైకి

విశాఖ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు యధాతధంగా ఉంటాయి

Update: 2024-06-25 01:47 GMT

విశాఖ వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఇటీవల జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ లతో పాటు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే భద్రతా పనుల కారణంగా ఈ ఎక్స్‌ప్రెస్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విశాఖ వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దాదాపు నలభై ఐదు రోజులు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తొలుత ప్రకటించినా...
ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ రద్దు చేయాలని భావించింది. ప్రధానంగా విశాఖ వైపు వెళ్లే అనేక మంది ప్రయాణికులు ఈ రైళ్లపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రేపటినుంచి జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ లు యధాతధంగా నడుస్తాయని తెలిపింది. అన్ని రైళ్లను నడిపేందుకు సిద్ధమయింది. ప్రయాణికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News