Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది

Update: 2024-06-07 03:14 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే కనిపిస్తుంది. సహజంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ కు ముందు రోజు స్వామి వారిని దర్శించుకునే వారు అధికంగా ఉంటారు. ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో తిరుమలకు క్యూ కడుతున్నారు. ఈరోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయానికి పైగానే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

27 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,161 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,923 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.35 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News