Tirumala : దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు చేరుకుంటున్నారు.

Update: 2024-01-23 02:49 GMT

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలోనే తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తుంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకయితే గంటలకొద్దీ సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుగోలు చేసిన వారు మాత్రం స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుంది.

శ్రీవారిని దర్శించుకోవడానికి...
నిన్న తిరుమల శ్రీవారిని 67,568 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,084 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.58 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులు టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి పన్నెండు గంటల సమయం పడుతుంది.


Tags:    

Similar News