Tirumala : నేడు కూడా భక్తుల రద్దీ తగ్గలేదుగా.. కారణమేంటంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది

Update: 2024-05-29 03:08 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనపడుతుంది. వేసవి సెలవులు ముగియనుండటంతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

పదిహేడు కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పదిహేడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,509 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించారు.


Tags:    

Similar News