Pawan Kalyan : పవన్ కు భద్రత పెంచిన ఏపీ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచింది.

Update: 2024-06-18 06:51 GMT

రాష్ట్ర ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భద్రతను పెంచింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం కేటాయించింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. ఆయన తనకు కేటాయించిన విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని సందర్శించారు.

రేపు పదవీ బాధ్యతలను...
అక్కడి నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం పవన్ కల్యాణ్ సచివాలయం వెళ్లనున్నారు. పవన్ తన ఛాంబరు పరిశీలించనున్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. రేపు పవన్ కళ్యాణ్ 2నా బ్లాక్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


Tags:    

Similar News