చంద్రబాబు నాయుడుకు ఎంత మెజారిటీ వచ్చిందంటే?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో

Update: 2024-06-04 14:26 GMT

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ ప్రత్యర్థి కేఆర్ జే భరత్ పై చంద్రబాబు 47,340 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 18 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి చంద్రబాబుకు 1,20,926 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి భరత్ కు 73,585 ఓట్లు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 1989 నుంచి కుప్పం నుండి పోటీ చేస్తున్నారు. ఎనిమిదోసారి కూడా కుప్పం నుండి చంద్రబాబు నాయుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో ఎన్టీఆర్ భవన్ హోరెత్తిపోయింది. ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 

Tags:    

Similar News