Chandrababu : ఎల్లుండి వారణాసికి చంద్రబాబు

మే 14న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాసికి బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2024-05-12 08:17 GMT

మే 14న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వారణాసికి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లనున్నారు. చంద్రబాబు కు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆహ్వానం అందడంతో మే 14వ తేదీన ఆయన వారణాిసి బయలుదేదరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

నామనిేషన్ కార్యక్రమంలో...
మే 14వతేదీన వారణాసిలో ఎన్‍డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మే 14న ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి వారాణాసికి చంద్రబాబు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం విజయవాడకు చంద్రబాబు తిరిగి వస్తారని చెబుతున్నారు.


Tags:    

Similar News