Tirumala : తిరుమలలో నేడు దర్శనానికి ఎంత సమయం అంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా క్యూ లైన్లన్నీ నిండిపోయాయి.

Update: 2024-05-22 03:11 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం కూడా క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. గత వారం రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వేసవి సెలవులు పూర్తి కానుండటంతో పాటు పరీక్ష ఫలితాలు రావడం, ఎండలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

బయట వరకూ...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు క్యూ లైన్ బయట టీబీసీ కాంప్లెక్స్ వరకూ విస్తరించి ఉంది. సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 35,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News