శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Update: 2023-03-27 03:05 GMT

తిరుమల వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పనుంది. నేడు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారు మూడు వందల రూపాయలు టిక్కెట్లు ఆన్‌లైన్ లో కొనుగోలు చేసి తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.

ఏప్రిల్ నెల కోటా...
అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన టిక్కెట్లను ఈరోజు ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు టిక్కెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్నారు. ఆన్‌లైన్ లో టిక్కెట్లు తీసుకునే భక్తులు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వెబ్‌సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల టిక్కెట్లు కావడంతో శ్రీవారి టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోనున్నాయి.


Tags:    

Similar News