వృద్ధుల దర్శనం పై వదంతులను నమ్మొద్దు

తిరుమల తిరుపతి దేవస్థానంలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది;

Update: 2024-08-04 12:58 GMT
specaial darshan tickets, november month quota, Tirumala Tirupathi
  • whatsapp icon

తిరుమల తిరుపతి దేవస్థానంలో వృద్ధుల దర్శనంపై వదంతులు నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వస్తున్నాయని అన్నారు. ఇవి పూర్తిగా అవాస్తవమని తెలిపారు.వాస్తవం ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోందని తెలిపారు.

ప్రతిరోజూ మధ్యాహ్నం...
టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయల ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కావున సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేసింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని కోరింది


Tags:    

Similar News