నేడు తిరుమల దర్శన టోకెన్లు విడుదల

ఈరోజు నవంబర్ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు

Update: 2022-09-21 02:33 GMT

ఈరోజు నవంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఆన్ లైన్ కోటాను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఆన్ లైన్ లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. నవంబరు నెలలోనే ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఆర్జిత సేవా టిక్కెట్లు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు వెబ్‌సైట్ లో ఉంచుతారు. అక్టోబరు నెల అంగప్రదిక్షిణం టోకెన్లకు సంబంధించి రేపు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే అక్బోబరు 1నుంచి ఐదో తేదీ వరకూ అంగ ప్రదిక్షణ టోకెన్లు ఉండవు.

కొనసాగుతున్న రద్దీ...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు పొందిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
నిన్న హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 73,186 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,365 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.60 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News