నేడు బెజవాడకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ నేడు విజయవాడ రానున్నారు. బీజేవైఎం ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.

Update: 2022-08-21 03:45 GMT

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ నేడు విజయవాడ రానున్నారు. బీజేవైఎం ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కొన్నాళ్లుగా బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర చేపట్టింది. ఈ ముగింపు సమావేశంలో కేంద్రమంత్రి అనుగార్ ఠాకూర్ పాల్గొంటారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఠాకూర్ బైక్ ర్యాలీతో ఎయిర్ పోర్టు నుంచి నగరానికి చేరుకుంటారు.

ముగింపు సభలో...
అనురాగ్ ఠాకూర్ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్స్ లో జరిగే యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో అనురాగ్ ఠాకూర్ పాల్గొంటారు. అనంతరం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళతారు.


Tags:    

Similar News