Ys Jagan : క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.;

Update: 2024-12-25 03:48 GMT
ys jagan, ycp chief, christmas celebrations, pulivendula
  • whatsapp icon

వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులందరూ ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. జగన్ పులివెందులకు నిన్న వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చిన ఆయనకు పార్టీనేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు.

ప్రత్యేక ప్రార్థనల్లో...
ఈరోజు సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న జగన్ రాష్ట్రంలో ప్రజలు అందరూ శాంతియుతంగా జీవించాలని కోరుకున్నారని చెప్పారు. జగన్ వెంట ఆయన కుటుంబ సభ్యుల కూడా ఉన్నారు. జగన్ నాలుగు రోజుల పాటు పులివెందులలోనే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ఆయననివాసంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.




ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News