Ys Jagan : జగన్ ట్వీట్.. పార్టీ కార్యాలయం కూల్చివేతపై

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్ జగన్ స్పందించారు

Update: 2024-06-22 04:02 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని ఆయన ట్వీట్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు తెల్లవారు జామునుంచి అధికారులు కూల్చివేయడంపై ఆయన స్పందించారు.

హైకోర్టు ఆదేశాలను....
హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ప్రభుత్వం కావాలనే ఈ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని తెలిపారు. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణంలో ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూల్చివేతలను మున్సిపల్, సీఆర్డీఏ అధికారులు ప్రారంభించారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News