నేడు గుంటూరుకు వైఎస్ జగన్.. పర్యటన వివరాలు ఇవే!!

నేడు వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి గుంటూరు సబ్ జైల్‌కు

Update: 2024-09-11 04:44 GMT

 ys jagan 

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుండి విజయవాడకు మంగళవారం చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు వైఎస్ జగన్ గుంటూరులో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి గుంటూరు సబ్ జైల్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అండర్ ట్రైల్ ఖైదీగా గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ పరామర్శిస్తారు. అక్కడ నుండి బయలుదేరి ఎస్‌వీఎన్ కాలనీలోని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి చేరుకుంటారు. టీడీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబిరెడ్డిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుండి బయలుదేరి నేరుగా తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.

మంగళవారం సాయంత్రం వైఎస్‌ జగన్‌ బెంగళూరు పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి.


Tags:    

Similar News